బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏజీపీకి సన్మానం

Published: Saturday May 21, 2022
లక్షెటిపేట , మే20, ప్రజాపాలన ప్రతినిధి:
 
మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు బార్ అసోసియేషన్ హాలులో  నూతనంగా అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్(ఏజీపీ)గా ఎంపికపైన జి.పద్మ ను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు పద్మను శాలువాతో సన్మానించి పుష్ప గుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాదులు వృత్తి ధర్మాన్ని పాటించి న్యాయం వైపు నిలబడాలని కోరారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.ప్రదీప్ కుమార్ కోశాధికారి అఫ్జల్ భియాబాని న్యాయవాదులు కొమ్మిరెడ్డి సత్తన్న చుంచు తిరుపతి స్వామి తిప్పని రవికుమార్ వేల్పుల సత్యం మేదరి పాల్సన్ ఎస్. కె.తాజోద్దిన్ రెడ్డిమల్ల ప్రకాశం కుడెల్లి అశోక్ మంచాల సదాశివ చాతరాజు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు