ఏప్రిల్ 2న కరీంనగర్ లో జరిగే జిల్లా ఎస్సీ మోర్చా సమావేశాన్ని విజయవంతం చేయండి శంకరపట్నం మార
శంకరపట్నం మండల కేంద్రంలో శుక్రవారము నిర్వహించిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏప్రిల్ రెండవ తేదీన కరీంనగర్ లో జరగనున్న ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఎస్సి మోర్చా రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఎస్సీ ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా మండల, వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్సి నాయకులు పాల్గొని జిల్లా కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయగలరని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడి బాల్ రెడ్డి కోరారు. అయన మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి దళిత సామాజిక వర్గాన్ని జాగృతం చేయడానికి ఎస్సీ మోర్చ నాయకులు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా నరేంద్ర మోడీ ఎస్సీ సామాజిక వర్గానికి చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లమల్ల ప్రసాద్, తుర్పాటి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జైపాల్, శంకరపట్నం మండల ప్రధాన కార్యదర్శి దాసరపు నరేందర్, పల్లె శివారెడ్డి మండల ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి రంజిత్, రేడియో రాములు, ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు బిజిలి సారయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: