మధ్యాహ్న భోజనం పరిశీలన
Published: Wednesday November 23, 2022
మధిర రూరల్ నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) మండలంలోని వంగవీడు ప్రాథమికోన్నత పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర బృంద సభ్యులు ప్రసాద్, మాధవరావు పాల్గొని మధ్యాహ్న భోజన మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన రికార్డులను పరిశీలించారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య పాల్గొని ఈ పాఠశాలను సందర్శించి తొలి మెట్టు అమలు తీరును, మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వై ప్రభాకర్ పాల్గొన్నారు.
Share this on your social network: