కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వై ఎస్ ఆర్ జయంతి వేడుకలు

Published: Friday July 09, 2021
మధుర, జులై 08, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలుజన హృదయ విజేత వైఎస్ రాజశేఖర రెడ్డి సూరంసెట్టి కిషోర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిజయంతి సందర్భంగా ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. మధిర మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంసెట్టి కిశోర్, మిరియాల రమణ గుప్త. వైస్ రాజశేఖరరెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్ మాట్లాడుతూ. ప్ర‌తీ తెలుగువాడి గుండెల్లో కొలువైన దైవం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి. సామాన్యుడి క‌ష్టాలు క‌నుక్కొని, వాటిని తీర్చే విధంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు రూపొందించిన ఘ‌న‌త ఆయ‌న‌ది. అందుకే ఆయ‌న తెలుగువారికి ఆరాధ్య దైవం గా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలకు వైఎస్ శ్రీకారం చుట్టారు అని అన్నారు.. ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చావా వేణు, sc సెల్ మండల అధ్యక్షుడు దారా బాలరాజు, మున్సిపల్ కౌన్సిలర్ లు మునుగోటి వెంకటేశ్వరరావు, కోన ధని కుమార్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవి కుమార్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, ఆది మూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, గౌసుద్దీన్, బండారి నర్సింహారావు, కరివేదరాంబాబు.. మొదలుగువారు పాల్గొన్నారు.