టీఆర్ఎస్ విజయం పట్ల అన్నారుగూడెంలో సంబరాలు..

Published: Monday November 07, 2022
తల్లాడ, నవంబర్ 6 (ప్రజాపాలన న్యూస్): 
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం పట్ల తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లీం మైనార్టీ సెల్ నాయకులు షేక్. యాకూబ్ పాషా అధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన తెరాస మాజీ గ్రామ అధ్యక్షులు పొన్నం కృష్ణయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన అంతిమ విజయం సీఎం కేసీఆర్ దే అన్నారు. తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారానే ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా కారుదే గెలుపన్నారు. ఈ కార్యక్రమంలో పడాల లక్ష్మణరావు, గోవిందు వెంకటేశ్వర్లు, పులి రామారావు,  రాగం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.