ప్రజా రక్షణే బిజెపి ధ్యేయం

Published: Tuesday September 21, 2021
మధిర, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : మధిరలో బిజెపి కోవిడ్ హెల్త్ వాలెంటీర్స్ సమావేశం జరిగింది, ఈ సమావేశనికి బిజెపి కోవిడ్ హెల్త్ వాలింటర్ల మధిర నియోజకవర్గం కన్వీనర్ చిలువేరు సాంబాశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మధిర పట్టణ, రూరల్, మరియు ఎరుపాలెం, మండల ల బిజెపి కోవిడ్ హెల్త్ వాలెంటరీస్ పాల్గొన్నారు., ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఐ కేర్, హాస్పిటల్ Dr.మురళి కృష్ణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కోవిడ్ టీకా అందించేలా వాలెంటరీ లందరు మీ మీ ప్రాంతాలలో ప్రజలకు అవగాహనా కల్పంచాలని, అందర్ని టీకా వేసుకునేలా అవగహన కల్పించాలని, కోవిడ్ సోకాకుండా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, భౌతికాదురం పాటిస్తూ, తరుచు సబ్బుతో చేతులు కడుగుతూ పరిశుభ్రత పాటించాలని, కోవిడ్ మనకు సోకాకుండా నిరంతరం అప్రమత్తతో ఉండాలని ప్రజలకు సూచన చేశారు.నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రజలకు ఉచితంగా వాక్సిన్ అందిచడంలో పట్ల నరేంద్రమోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ ప్రజల పక్షాన బిజెపి ప్రభుత్వం ఉన్నది అని అన్నారు. జిల్లా బిజెపి కోవిడ్ హెల్త్ వాలెంటర్స్ కన్వీనర్ జ్వాలా నరసింహారావు గారు పలు సూచనలు వాలింటర్స్ కు అందించటం జరిగినది. ఈ కార్యక్రమంలో మధిర పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, దళిత మోర్చా జిల్లా అధికార ప్రతినిధి దేవరకొండ కోటేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి ముప్పాలా చంద్రమౌళి, జిల్లా కార్యవర్గం సభ్యులు కుంచం కృష్ణారావు, బీజేపీ జిల్లా నాయకులు, మరియు రూరల్ మండల ఇంచార్జి, రామిశెట్టి నాగేశ్వరావు, సీనియర్ బిజెపి నాయకులు కొప్పురావూరి రామయోగేశ్వరావు, ఏబీవీపీ డివిజన్ నాయకులు శివరాజు సుమంత్, పట్టణ ప్రధాన కార్యదర్శి పగడాల. నాగేంద్ర బాబు, బియ్యవరపు. రామకృష్ణ, పింజారి. ఖాజామియా, బొడ్డు. మాధవసాయి, కరం. నరసింహారావు, బొక్క.రమేష్, P రామకృష్ణ. తదితరులు పాల్గున్నారు.