రంగయ్యకు మట్టా దయానంద్ నివాళులు..
Published: Tuesday September 13, 2022
తల్లాడ, సెప్టెంబర్ 12 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడకు చెందిన నన్నపనేని రంగయ్య ఇటీవల మృతి చెందారు. సోమవారం ఆయన ఆయన దశదిన కర్మ తల్లాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన వారిలో టిఆర్ఎస్ నాయకులు గణేశుల రవి, తూము నరసింహారావు, తిమ్మినేని ప్రసాదు, దొడ్డ శ్రీనివాసరావు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ యాకుబ్ పాషా ఉన్నారు.
Share this on your social network: