నిత్య అన్నదాన సత్రాన్ని సందర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

Published: Monday December 13, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం లోని కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహిస్తున్న నిత్య అన్నదాన ప్రాంగణాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదివారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా నిత్య అన్నదాన కార్యక్రమం గురించి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దుర్గం చిన్నయ్యకు పూర్తి వివరాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అంటే ఎంతో వ్యయ, ప్రయాసలకు ఓర్చుకొని చేయడం తనకు తానే సాటి అని, ఆది చేయడం మరెవ్వరికీ సాధ్యం కాదని అన్నారు, ప్రతినిత్యం వందలాది మందికి అన్నం పెట్టి ఆదుకోవడం పూర్వ జన్మ సుకృతం అని పది కాలాల పాటు నియోజకవర్గ ప్రజలు ఆయనను గుర్తు చేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిన్నయ్యతో పాటు పలువురు తెరాస నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.