ఈనెల 27న టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ద్వితీయ మహాసభలు ** జిల్లా అధ్యక్షుడు మహేష్ ** మహాసభల పోస్టర్లు

Published: Saturday November 26, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 25 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఈనెల 27వ తేదీన హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళామందిర్ లో జరిగే టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి మహేష్, రాజశేఖర్, లు కోరారు. ద్వితీయ మహాసభలకు సంబంధించి శుక్రవారం జిల్లా కేంద్రంలో జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి, జెడ్పిటిసి అరిగెల నాగేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారిని గంధం లక్ష్మీలతో పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న అనేకమంది జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఒక యూనియన్ గా సంఘటితంగా ఉంటే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడం కోసం టిడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఎంతో కృషి చేస్తుందన్నారు. జిల్లా నుండి జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సతీష్ లు పాల్గొన్నారు.