మనోల్లాసంగా సాగిన జస్వీందర్ సింగ్ గజల్ గానం. హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి):
Published: Monday October 17, 2022
ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు కుల్దీప్ సింగ్ స్వరపరచిన హైదరాబాద్ యువ ఉర్దూ గజల్ రచయిత షకీల్ అహ్మద్ షాయర్ రచించిన "జిందగీ" మధుర జ్ఞాపకాలు అనే గజల్స్ ను పాపులర్ గజల్ గాయకుడు జస్వీందర్ సింగ్ శనివారం రాత్రి గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ లో ఆలపించారు. నగరానికి చెందిన గజల్ ప్రేమికులు వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందించారు..
జస్వీందర్ సింగ్ ప్రేక్షకుల కోసం అనేక జగ్జీత్ సింగ్ ఆలపించిన ఆనాటి మధుర మెలోడీ గజల
" తుమ్ కో దేఖా తో ఏ ఖయాల్ ఆరహా హై" ఆలపించారు..షకీల్ అహ్మద్ రచించిన " బిక్ రహిహై మౌత్ భీ అబ్ జిందగీ కే నామ్ సే" మరియు "దిల్ ఏ బే బకర్ " అన్న గజల్ అందర్నీ ఆకట్టుకుంది.
Share this on your social network: