పారిశుద్ధ్య పనులను ఆటంకపరుస్తున్న మక్కల గిర్ని
Published: Wednesday June 23, 2021
సర్పన్ పల్లి సర్పంచ్ షాకేరా బేగమ్ ఫకీరాఖాన్
వికారాబాద్, జూన్ 22, ప్రజాపాలన బ్యూరో : గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని సర్పన్ పల్లి గ్రామ సర్పంచ్ షాకేరా బేగమ్ ఫకీరా ఖాన్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ పల్లి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేఫట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి వార్డులోని మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలోని కొందరు రైతులు పరిగె మక్క ఎన్నులను గిర్నీకి పోయడంతో దాని వ్యర్థాలన్నీ మురికి కాలువల్లో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యర్థాలన్నీ మురికి కాలువల్లో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యంత్రం యజమానికి, రైతులకు గ్రామ పంచాయతీ ద్వారా నోటీస్ పంపిస్తామని హెచ్చరించారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
Share this on your social network: