దౌరిశెట్టి సత్యమూర్తి ఇద్దరు కూతుళ్ళ ఆచూకీ లభ్యం

Published: Tuesday June 28, 2022
 వికారాబాద్ జిల్లా ఎస్పి కోటిరెడ్డి
వికారాబాద్ బ్యూరో జూన్ 27 ప్రజాపాలన :  దౌరిశెట్టి సత్యమూర్తి తన ఇద్దరు కూతుళ్ళతో శుక్రవారం అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లు ఒక ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని వికారాబాద్ జిల్లా ఎస్పి కోటిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిస్సింగ్ ఐన తన భార్య అన్నపూర్ణను 48 గంటలలో పోలీసులు ఛేదించి తన భార్య జాడను కనిపెట్టాలని సూచించారని పేర్కొన్నారు. దౌరిశెట్టి, ఇద్దరు కూతుళ్ళతో సహా ఆత్మహత్య చేసుకొని అట్టి లొకేషన్ ను షేర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇట్టి విషయంలో తాండూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అతని ఫోన్ సిగ్నల్స్ మరియు వాహనం జాడ ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్టుకు పోలీసు సిబ్బంది వెళ్లారు. అక్కడి పోలీసు సిబ్బంది సహాయంతో వారు అక్కడి నుండి ముంబై వెళ్ళినట్లు గుర్తించి అక్కడి నుండి వారణాసి వెళ్ళినట్లు తెలుసుకోవడం జరిగింది. వారణాసికి ప్రత్యేక బృందాలను పంపించి అక్కడ దర్యాప్తు చేసి ఒక హోటల్ లో వారి జాడను కనుకోవడం జరిగింది.  దౌరిశెట్టి సత్యమూర్తిని మరియు ఆయన ఇద్దరు కూతుర్లను త్వరలోనే తాండూర్ కు తీసుకొని వస్తాం అని ఎస్‌పి తెలిపినారు