ఎన్ ఎస్ ఎప్ సదస్సును విజయవంతం చేయాలి. ... రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్

Published: Tuesday December 13, 2022
జన్నారం, డిసెంబర్ 12, ప్రజాపాలన:  
 
ఈనెల 22 న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే నవతరం స్టూడెంట్ పెడరేషన్ 5వ ఆవిర్భావ సదస్సు విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రామ్ ప్రసాద్ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహాసభల కు సంబంధించిన గోడ పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. కేజీ టు పీజీ విద్య ను ఉచితంగా అందజేస్తానని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు హామీఇచ్చి నేడు హామీలు మరిచిపోయిండని అన్నారు.
ధనిక రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి
పోయిన సంవత్సరం వరకు పెండింగులో ఉన్న  రూ. 3,375 కోట్ల  స్కాలర్ షిప్స్ లు విడుదల చేయలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు ద్యావనపల్లి సాయి చరణ్, పవన్ కుమార్, సాయి కిరణ్, ప్రవీణ్, మహేష్, నగేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.