వరద సహాయక పనులలో కాంగ్రెస్ శ్రేణులు విరివిగా పాల్గొనాలి
Published: Saturday July 16, 2022
మధిర జులై 15 ప్రజాపాలన ప్రతినిధి
రాష్ట్రంలో వరదల తీవ్రత భయంకరంగా ఉందని ప్రజలు ఆస్తులు, పంటలు, ఇళ్లు అన్ని కోల్పోయి నష్టాల్లో ఉన్నారని వారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కోరారు. శుక్రవారం మధిరలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరద బాధితులకు ఆహారం, పాలు, మంచినీరు, మందులు, నిత్యావసర వస్తువులు, బిస్కెట్లు, బట్టలు ఏది అవసరం ఉంటే అది అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి పని చేయాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా సేవలో సైనికులు లాగా పని చేసి ప్రజల అవసరాలు తీర్చాలన్నారు
ప్రజలు గతంలో ఎన్నడూ లేనంత కష్టాలలో ఉన్నారని ఆయన అన్నారు
ప్రభుత్వాలు వరద అంచనాలు, ముందస్తు జాగ్రత్తలు, ప్రజా అవసరాలు తీర్చడంలో విఫలం అయ్యారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం.ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలను తీర్చడంలో ముందుండి పని చేయాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
Share this on your social network: