శాలివాహన పవర్ ప్లాంట్ నూతన కార్మిక సంఘం అధ్యక్షుడి ఎన్నిక*
Published: Thursday January 19, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల శాలివాహన గ్రీన్ ఎనర్జీ పవర్ ప్లాంట్,కార్మిక సంఘం నూతన అధ్యక్షుడిగా కుంటాల శంకర్ ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కమిటీని నమ్మకంతో ఎన్నుకున్న కార్మికులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు, పవర్ ప్లాంట్ కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. అనంతరం నూతన కమిటీ ప్రకటించారు జనరల్ సెక్రటరీగా నిమ్మరాజుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా సగ్గుర్తి ఆనందరావు, కాయితి శ్రీనివాస్, కోశాధికారిగా దొడ్డిపెళ్లి మల్లయ్య, కార్యవర్గ సభ్యులుగా రావుల తిరుపతి, అనుమల శ్రీనివాస్, పెంట సత్యం, ముఖ్య సలహాదారులుగా ఎడ్ల శ్రీనివాస్, చెట్టి శ్రీనివాస్, బి.వి.ప్రసాద్, లను ఎన్నుకున్నారు.
Share this on your social network: