ఏక్ నిరంజన్.. ఉద్యమ పోరాట పలితమే జగిత్యాల మెడికల్ కాలేజ్

Published: Friday May 21, 2021
డా: సిరికొండ రవిశంకర్ కు పలువురు ఘనంగా సన్మానం.. 
జగిత్యాల, మే 20 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణానికి చెందిన డా:సిరికొండ రవిశంకర్ ఉద్యమ పోరాట ఫలితమే జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజి మంజూరు అయిందని పలువురు రాజకీయ ప్రముఖులు వివిధ సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేశారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకోని సంవత్సరం పాటు నిరాహార దీక్షలు పాదయాత్రలు కాలేజి విద్యార్థులతో సమావేశాలు ర్యాలీలు దేవాలయాల్లో పూజలు ప్రభుత్వ అఫిసుల్లో వినతి పత్రాలు ఇలా ఎన్నో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా (ఏక్ నిరంజన్ ఒకే... ఒక్కడు) రోడ్లమీద ప్లా కార్డు పట్టుకుని తిరుగుతే చూసే జనం పిచోడిలా అనుకున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి పోరాట ఫలితమే మెడికల్ కాలేజి అని విశ్లేషకులు మేధావులు నాయకులు అభిప్రాయపడుతు చర్చించుకుంటున్నారు. జగిత్యాల బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గాజుల నాగరాజు జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండ్ర జగన్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ కుమార్ బిసి సంఘం నాయకులు పులి నర్సయ్య ఓసి సంఘం నాయకులు సార శ్రీనివాస్ రెడ్డి శాలువాలతో డా: రవిశంకర్ ను సన్మానించారు.