మడుపల్లి 7వ వార్డులో ప్రారంభమైన జ్వరం సర్వే
Published: Saturday January 22, 2022
మధిర జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ఏడో వార్డ్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో కరోనాను గత రెండు దశలలో ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి జ్వరం సర్వే చేపట్టాలి అనే ధ్రుడ సంకల్పంతో కెసిఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాలతో, ఈరోజు నుండి మధిర మున్సిపాలిటీ పరిధిలో ఖమ్మం జిల్లా పరిషత్ లింగాల కమల్ రాజు ఆదేశాలతో, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత జయాకర్, కమీషనర్ రమాదేవి నేత్రుత్వంలో మడుపల్లి 7వ వార్డులో 7వ వార్డు కౌన్సిలర్ మేడికొండ. కళ్యాణి కిరణ్ ఆధ్వర్యంలో జ్వరం సర్వే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ కా.ని.కార్యదర్శి మేడికొండ. కిరణ్, 7వ వార్డ్ ఇంచార్జి ఆర్. గోపి, ఆశ వర్కర్స్ మరియు మెప్మా ఆర్ పి లు పాల్గొన్నారు.
Share this on your social network: