మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ లో పాల్గొన్న రాగిడి లక్ష్మార

Published: Saturday October 15, 2022
మేడిపల్లి, అక్టోబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి)
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి  ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మునుగోడుకు తరలి వెళ్ళారు. మునుగోడు చండూరుకు వెళ్లిన రాగిడి లక్ష్మారెడ్డికి  ఆయా గ్రామల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. అనంతరం బైక్ పై ర్యాలీగా బయలుదేరి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ ఇంచార్జ్ మేడల మల్లికార్జున్ గౌడ్, మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ డివిజన్ ఇంచార్జ్ పోలిపాక అంజయ్య, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పత్తి కుమార్, స్టేట్ జనరల్ సెక్రెటరీ కాంగ్రెస్ సేవాదళ్ సద్గుణ రావు ,మహిళా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మి, రామంతపూర్ డివిజన్ ఇంచార్జ్ తవిడబోయిన గిరిబాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ శెట్టి, నెమలి అనిల్ , సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజయ్ జైన్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కరిపే సంతోష్, కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ ,భాను, ఎండి రిజ్వాన్ రమేష్ నాయక్, కిషన్ నాయక్ ,మల్లికార్జున్, నవీన్ ,చందు యాదవ్, మల్లేష్ ,గొల్లూరి ప్రభాకర్ ,కరిపే మల్లికార్జున్, రాజేష్ జహీర్, చుక్కల స్వామి, తదితరులు  పాల్గొన్నారు.