సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి: టీఎస్ యుటిఎఫ్ మండల శాఖ

Published: Saturday October 29, 2022

బోనకల్,అక్టోబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: సిపిఎస్ విధానాన్నిరద్దు చేయాలని కోరుతూ ఎస్ టి ఎఫ్ ఐ పిలుపుమేరకు టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల శాఖ ఆధ్వర్యంలో సంతకాల సేకరణను చేపట్టడం జరిగింది .ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు బి ప్రీతం, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు. రామకృష్ణ, మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా ఎస్ టి ఎఫ్ ఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుందని ఈ సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత రాష్ట్రపతి కి సంతకాలతో కూడిన మెమరాండాన్ని ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో సిపిఎస్ ను రద్దు చేశాయని, అదే విధంగా దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి జిపిఎఫ్ విధానాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్ చలపతిరావు సంతకం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర చారి, హరి ప్రసాద్, ఉపాధ్యక్షులు కంభం రమేష్, సౌభాగ్య లక్ష్మి పద్మజ, టీఎస్ యుటిఎఫ్ కార్యదర్శి గోపాలరావు ,శ్రీనివాసరావు, సురేష్, రామారావు, నాయకులు సధా బాబు, జిల్లా కోటయ్య లవకుశ తదితరులు పాల్గొన్నారు.