మునుగోడు విజయం జిల్లా కేంద్రంలో సంబురాలు

Published: Monday November 07, 2022
* సంక్షేమ పథకాలే టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఆయువుపట్టు
* 15వ వార్డు కౌన్సిలర్ అనంత్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 6 నవంబర్ ప్రజాపాలన : రాష్ట్రంలో మరో 15 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారములో ఉంటడం జరుగుతుందని,మునుగొడు గెలుపుతో టిఆర్ఎస్ పార్టీలో జోష్ పెరిగిందని వికారాబాద్ టీఆరెస్ నాయకులు అనంత్ రెడ్డి తెలిపారు.రాష్ట్రంలో సంచలనం రేపిన మునుగోడు ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధించడంతో ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో టీఆరెస్ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....బిఆరెస్ పార్టీ దేశంలో చక్రం తిప్పనుందని,దేశ రాజకీయాలను శాశించే సత్తా కేవలం బిఅరెస్ పార్టీకే ఉందన్నారు.మునుగొడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుతో రాష్ట్రంలో పార్టీకి తిరుగులేదని మరోమారు ఋజువైందన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్,పాండు,శ్రీనివాస్ గౌడ్ కైల ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.