భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు భాగం శారయ్య మృతి
Published: Wednesday February 02, 2022
బోనకల్, ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి: మండలం లోని గోవిందాపురం( ఏ) గ్రామంలో స్వాతంత్ర్య సమర యోధులు తెలంగాణ సాయుధ పోరాట యోధులు, భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు భాగం శారయ్య (96) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. మృతినికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి కి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, సీపీఐ మండల కార్య దర్శి యంగల ఆనందరావు, జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం తదితరులు వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన మృతి కి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు బుధవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించ నున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
Share this on your social network: