అటల్ బిహారీ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి బిజెపి బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి

Published: Monday December 26, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి:  భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని  అందరూ ఆదర్శంగా తీసుకోవాలని బెల్లంపల్లి నియోజకవర్గ బిజెపి నాయకులు అన్నారు.
ఆదివారం వాజ్ పాయ్  92వ జన్మదిన వేడుకలు బెల్లంపల్లి లో బిజెపి నియోజకవర్గ ఇంఛార్జి కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో స్థానిక రాంజీ గోండు ఆవసంలో ఘనంగా నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి, మిఠాయిలు , పండ్లు పంపిణీ చేసి, ఘనంగా నిర్వహించారు.
  ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అటల్ బిహారీ వాజపేయి ఈ దేశానికి ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని,
 రాజనీతి,  నైతిక విలువలు కలిగిన నాయకుడని తెలిపారు. ఆయన నిరాడంబర జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, దేశంలో హిందూ రాజ్య స్థాపన కోసం, జాతీయ వాద సిద్దాంతం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారని కొనియాడారు. 
ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో అణు పరీక్షలు నిర్వహించి దేశ భద్రత కోసం కృషి చేశారని అన్నారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవరెడ్డి, జిల్లా కార్యదర్శి గోవర్దన్, జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజూలాల్ , ఎస్టీ మోర్చ మాజీ అధ్యక్షులు అజ్మీరా శ్రీనివాస్, దూది ప్రకాష్,  శ్రావణ్, నాగరాజ్, రాంజీ గోండు ఆవాసం నిర్వాహకులు కాసర్ల తిరుపతి, విజయలక్ష్మి, లక్ష్మి నారాయణ, నర్సింగ్, నవీన్, రాయమల్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.