నిఖిల్ చౌదరికి నివాళులర్పించిన జడ్పీటీసీ ప్రమీల..

Published: Monday January 30, 2023
తల్లాడ, జనవరి 29 (ప్రజా పాలన న్యూస్):
 *ఎమ్మెల్సీ, బీఅర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ సోదరుడి కుమారుడు తాతా  నిఖిల్ చౌదరి  దశదిశ ఖర్మ ఆదివారం పిండిప్రోలు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ జడ్పిటిసి దిరిశాల ప్రమీల హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తో  కొద్దిసేపు మాట్లాడారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట బీఅర్ఎస్ జోనల్ చైర్మన్  దిరిశాల దాసురావు ఉన్నారు.*