పలు కుటుంబాలకు అర్డికసహయం అందజేత

Published: Wednesday March 03, 2021
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య
పాలేరు (ప్రజాపాలన ప్రతినిధి) మార్చి 2: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నరం గ్రామంలోని దసరా నాగమ్మ మరియు పైనంపల్లి  గ్రామంలోని భీమల్ల తిరపతమ్మ గారు మరణించిన విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారికి తెలియజేయడంతో వారి కుటుంబాలకి తెరాస పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య  గారి ద్వారా 10,000/-రూపాయలచొప్పున ఆర్ధిక సహాయాన్ని అందిచటం జరిగిది...ఈ కార్యక్రమంలో పైనంపల్లి గ్రామంలో DCMS ఖమ్మం జిల్లా  డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, మరియు గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా చెన్నారం గ్రామంలో ఈరోజు మృతి చెందిన దసరా నాగమ్మ, అంత్యక్రియల నిమిత్తం పుణ్యం బ్రహ్మయ్య, ఆధ్వర్యంలో పార్టీ నాయకుల చేతులమీదుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించటం జరిగింది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు చాగంటి మధుసూదన్ రావు, గంజికుంట్ల వెంకన్న, కోదాటి శ్రీనివాస రావు, వైస్ సర్పంచ ఎం వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కిలారి వెంకన్న, బట్టపోతుల కిరణ్, కుమ్మరి శీను, తదితరులు పాల్గొన్నారు.