మారుమూల గ్రామాల అభివృద్ధే ప్రభుత్వం ధ్వేయం డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు..

Published: Friday July 09, 2021
పాలేరు జూలై 8 (ప్రజాపాలన ప్రతినిధి) : మారుమూల గ్రామాల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం ద్వేయమని డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు అన్నారు. మండలం లోని పైనంపల్లి గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు కు గురువారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వం అభ్యున్నతి కోసం పాటుపడుతున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యం.చంద్రశేఖర్, సర్పంచ్ కొండ్రు విజయలక్ష్మి, ఎంపీటీసీ ఉసిరికాయల లక్ష్మయ్య, గడ్డం సత్యం తదితరులు పాల్గొన్నారు.