సాయి భరత్ కు సన్మానం

Published: Wednesday October 06, 2021
ఎర్రుపాలెం, అక్టోబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి: ఎర్రుపాలెం హై స్కూల్ విద్యార్థికి భాస్కర iiit లో ర్యాంకు సాధించినందుకు గుమ్మడి రాజుల సాయి భరత్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతమైన స్థానానికి చేరి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, ఎస్సై ఉదయ్ కిరణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి యన్నం శ్రీనివాస రెడ్డి, ఎర్రుపాలెం సర్పంచ్ మొగిలి అప్పారావు, సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఎర్రుపాలెం ఎంపీటీసీ షేక్ మస్తాన్ వలీ, దేవరకొండ చిరంజీవి, నాగ మల్లేశ్వరరావు, ఇనప నూరి భాస్కర్ పాల్గొన్నారు.