డప్పు వాయించే దళితులకు పింఛను ఇస్తానని మాట తప్పిన సీఎం

Published: Tuesday July 27, 2021
ఇబ్రహీంపట్నం, జులై 26, ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని తహశీల్దార్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ  అధ్యక్షుడు బూడిద రాం రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బిజెపిరాష్ట్ర నాయకులు ముత్యాల భాస్కర్. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితులను మరిచారని, మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మోసం చేశారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే దళితున్నీ సీఎం చేస్తా అని నమ్మించి మోసం చేశారన్నరు... ఎండేండ్ల లో కేసీఆర్ ప్రభుత్వం దళితులకు ఎం చేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు. డప్పు కొట్టే కళాకారులకు 5 వేల రూపాయల పింఛన్ ఇస్తా అని నమ్మించి మోసం చేశారని అన్నారు. ప్రభుత్వం డప్పు కొట్టే కళాకారులకు రూ.5000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం పదవి చేపట్టే అర్హత కేసీఆర్ కి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ముత్యాల భాస్కర్, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.