అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న జువ్వాడి

Published: Monday January 16, 2023

కోరుట్ల, జనవరి 14 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట దగ్గర అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్పస్వామి పడి పూజలో  పాల్గొన్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు,జువ్వాడి కృష్ణ రావు అనంతరం ఆలయ ఈవో  జువ్వాడి నర్సింగ రావు, జువ్వాడి కృష్ణ రావును మర్యాద పూర్వకంగా సన్మానించారు. వీరితో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ సహాయక కార్యదర్శి రంజిత్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మెటుపల్లి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, మెటుపల్లి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు ఆనంద్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ వాసం అజాయ్ తదితరులు పాల్గొన్నారు.