జేఎస్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు..

Published: Monday October 03, 2022
ఖమ్మం, అక్టోబర్ 2 (ప్రజా పాలన న్యూస్): గాంధీ జయంతి దినోత్సవ వేడుకలను మధిర మండలం లో ఘనంగా నిర్వహించారు. జె యస్ యస్ ఖమ్మం జిల్లా డైరెక్టర్  వై రాధాకృష్ణ ఆధ్వర్యంలో మధిర, సిరిపురం, ఖమ్మం లో గాంధీ జయంతిని జె యస్ యస్ సెంటర్స్ లో ఘనంగా  నిర్వహించడం జరిగినది.ఈ సందర్బంగా డైరెక్టర్ రాధాకృష్ణ గాంధీ గారి హౌనత్యం, గొప్పతనం గురించి తెలిపారు, గాంధీ గారు సత్యాగ్రహమే ఆయుధముగా అహింస మార్గంలో పోరాట పటిమతో ఎంతో సహనం తో అగ్లెయులతో పోరాడి భారత దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహానుభావుడు మన గాంధీ.ఎందరో త్యాగమూర్తుల ఫలితంగానే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని,మనదేశాన్ని మనం కాపాడుకోనగాలిగాము అని డైరెక్టర్ రాధాకృష్ణ తెలియజేశారు.  ఈ కార్యక్రమం లో జె యస్ యస్ లబ్ధిదారులు, స్టాఫ్,రిశోర్స్ పర్సన్స్ జాస్మిన్, యస్ కె. రజియా, గ్రామ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎంపీపీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.