సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Published: Wednesday May 19, 2021
రాయికల్, మే 18 (ప్రజాపాలన ప్రతినిధి) రాయికల్ మండల మరియు పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలు వివిధ శస్త్ర చికిత్సలు చేయించుకోగా 14 లక్షల 10 వేల 500 రూపాయల చెక్కులను 45 మంది లబ్ధిదారులకు ఎమెల్యే డా.సంజయ్ కుమార్ గారి కృషితో మంజూరు కాగా మంగళవారం రాయికల్ చైర్మన్ మోర హన్మాండ్లు, ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గన్నే రాజారెడ్డి, పిఏ సీఎస్ చైర్మన్ మల్లరెడ్డి, టీ ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కోల శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్, హుస్సేన్, సోహైల్, కౌన్సిలర్ మహేందర్, నాయకులు ఏనుగందుల ఉదయశ్రీ, తదితరులు పాల్గొన్నారు..