ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

Published: Tuesday November 29, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 28, ప్రజాపాలన :  మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి  వేడుకలను మంచిర్యాల లోని బెల్లంపల్లి చౌరస్తాలో తెలంగాణ బి సి  జాగృతి ఆధ్వర్యంలో  132వ  వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.   ముఖ్యఅతిథిగా మంచిర్యాల  మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య  నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ బి సి జాగృతి పూలే చౌరస్తాలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని స్థాపించుటకై    చేస్తున్న  డిమాండ్ ను మా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో చర్చించి  పర్మిషన్ ఇచ్చే విధంగా తీర్మానం చేస్తామని అన్నారు. ఫూలే ఆశయాలను స్ఫూర్తి గా తీసుకొని  మనందరం ముందుకు వెళ్లాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ ,మాజీ వైస్ చైర్మన్ నల్ల శంకర్, సీనియర్ నాయకులు బిసి తుల మధుసూదన్, బేర ప్రభాకర్ బొలిశెట్టి రాజలింగు, గడ్డం సుధాకర్ కల్వల సుధాకర్, నులిగొండ ప్రకాష్, రాజేశం గౌడ్, తెలంగాణ బి సి  జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నారెడ్ల శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.