ప్రజలకిచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలి. -కాలేశ్వరం లో కోట్లు కొల్లగొట్టి విమానం కొన్నాడు

Published: Friday October 07, 2022
చేవెళ్ల, అక్టోబర్ 06 : (ప్రజా పాలన)

కాలేశ్వరం పేరిట దోచుకుని కోట్లు పెట్టి సీఎం కేసీఆర్ విమానం కొన్నారని బీజేపీ చేవెళ్ల మండలం ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంతరెడ్డి ఆరోపించారు. చేవెళ్ళ లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ నేతలు ప్రజాధనం వృథా చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఒకవైపు వీఆర్ఎలు సమ్మె చేస్తుంటే పట్టించుకోని సీఎం కేసీఆర్ ప్రజాధనంతో విమానం కొన్నారని ఆరోపించారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరడంపై ఇసుక, మొరం కంకర గుట్టలు మాయం చేసి గాలి మోటార్లపై తిరుగుతున్నారని ఆరోపించారు. రైతుల బాధలు వీఆర్ఎల సమస్యలు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.