ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 14ప్రజాపాలన ప్రతినిధి

Published: Thursday December 15, 2022

*వేప చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య*

మానసికంగా కృంగిపోయి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎంపీ గూడా పరిధిలో చోటుచేసుకుంది.  రమేష్ చౌదరి తండ్రి రామ్ చౌదరి అనే వ్యక్తి, వయస్సు 34 సంవత్సరాలు ఎంపీ గూడలో ఇబ్రహీంపట్నం కిరాణాదుకాణం నడుపుతున్నారు. మానసికంగా కృంగిపోయి బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వేప చెట్టుకు ఉరివేసుకుని సాహెబ్గూడ పరిధిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నం నుంచి కిరాణా వస్తువులు తీసుకురావాలని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఇలా ఉరివేసుకొని మరణించాడని తెలుసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.