యువతకు కంప్యూటర్ పరిజ్ఞానం చాలా అవసరం* *చేవెళ్ల లో కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవం లో

Published: Monday December 05, 2022
చేవెళ్ల నియోజకవర్గం:
చేవెళ్ల:(ప్రజాపాలన):
 
జర్నలిస్టు కాలనీలో ఎస్ డీ సొల్యూషన్స్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ ను *చేవెళ్ళ మాజీ ఎమ్మెల్యే కే. ఎస్.రత్నం* . కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి,చేవెళ్ల మండలం సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మధుసూదన్ గుప్తా,ప్రారంభించారు.ఈ సందర్భంగా..........మాట్లాడుతూ... ఆదివారం చేవెళ్ల మండల కేంద్రం లో కంప్యూటర్ పరిజ్ఞానం యువతకు చాలా అవసరమని అన్నారు. కంప్యూటర్ విద్య నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు మరింత  నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు. టెక్నాలజీ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు లభించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని కాకుండా స్వయం ఉపాధి తో యువత ముందడుగు వేయాలని సూచించారు. నేటి యువత ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా ఉండేలా విద్యలో ముందంజలో ఉండాలన్నారు.ఈ కార్యక్రమం లో మల్లారెడ్డి.కాంగ్రెస్ పార్టీ నాయకులు.తదితరులు పాల్గొన్నారు.