బూర్గంపహాడ్ మండల ప్రజలకు ధన్యవాదములు తెలియజేసిన బూర్గంపాడు -ఎస్. ఐ. పి. సంతోష్ కుమార్. బూర్గంప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో ఐటిసి పిఎస్పీడీ లో దిగి భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దర్శనానికి వెళ్లి మళ్లీ తిరిగి ఐటిసి గెస్ట్ హౌస్ లో విందు చేసి వెళ్లిన రాష్ట్రపతి పర్యటన ఎటువంటి అవాంతరాలు జరగకుండా విజయవంతం అయిన సందర్భం గా ఎస్సై సంతోష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూఒక ప్రకటన విడుదల చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....అధికారులకు ట్రాఫిక్ నియమ నిబంధనలకు సహకరించినటువంటి బూర్గంపహాడ్ మండల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వ్యాపారస్తులకు,ఐటీసీ యాజమాన్యానికి, మరియు సిబ్బందికి, కార్మికులకు నిన్న జరిగినటువంటి రాష్ట్రపతి పర్యటనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా ముగియడానికి కారకులు ఐన మీ అందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదములు అని బూర్గంపాడు
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. సంతోష్ ఒక ప్రకటనలో తెలియ జేశారు..
Share this on your social network: