రెడీమ్ ఇండియా ఆధ్వర్యంలో చీరలు, బైబిల్ పంపిణీ..

Published: Saturday December 31, 2022
తల్లాడ, డిసెంబర్ 30 (ప్రజా పాలన న్యూస్):
 *రెడీమ్ ఇండియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో శుక్రవారం తల్లాడతో పాటు గోపాలపురం గ్రామాల్లో నిరుపేదలకు చీరెలు, బైబిలు పంపిణీ చేశారు. వీటిని వెంకటగిరి సీయోను ప్రార్థన మందిరం  పాస్టర్ డి. తిమోతి చేతుల మీదుగా పేదలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడీమ్ ఇండియా  మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ మనోహర్ జేమ్స్ ఆర్థిక సహాయం ద్వారా నిరుపేదలకు ఉచితంగా వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు. గతంలో కూడా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.*