జగిత్యాల జైత్రయాత్ర బహిరంగ సభ విజయవంతం చేయండి.

Published: Thursday September 23, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : ఈనెల 26వ తేదీన జగిత్యాలలో రాజ్యాధికార సాధనకై బహుజన జగిత్యాల జైత్రయాత్ర బహిరంగ సభ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని ఈ సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు యు.ఎస్ సభ్యులు రాంజీ గౌతమ్ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ లు హాజరవుతున్నరని కథలాపూర్ మండల కేంద్రం నుండి మండలానికి చెందిన యువకులు పాదయాత్ర ప్రారంభించి కోరుట్లకు చేరిన సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ పుప్పాల లింబాద్రి ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి బాబా సాహెబ్ అంబేద్కర్, చాకలి ఐలమ్మ కొండా లక్ష్మణ్,బాపూజీ విగ్రహాలకు కు పూలమాలలు వేసి అనంతరం లింబాద్రి మాట్లాడుతూ ఈ నెల 26 న జరగబోయే జగిత్యాల జైత్రయాత్ర బహిరంగ సభను బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాల తో పాటు అగ్రవర్ణాలకు లలో ఉన్నటువంటి పేద ప్రజలు హాజరు కాగలరని విజ్ఞప్తి చేశారు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు ముఖ్యమంత్రి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కోరుట్ల పట్టణ ముఖ్యనాయకులు శేఖర్, నాగరాజు, శనిగరపు ప్రశాంత్, శోభన్, కర్ణాకర్ భాస్కర్, వేణు ,మనోజ్, కృష్ణ సాయి, గణేష్ ,విక్రమ్, రాజన్, లింగయ్య, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు