తుమేపల్లి రాగ అన్షిక పుట్టినరోజు సందర్భంగా సేవాసదన్ దివ్యాంగులకు అన్న వితరణ

Published: Monday February 14, 2022

మధిర ఫిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు మధిర వాస్తవ్యులు మధిర వాసవి ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు శ్రీ కురు వెళ్ళ కృష్ణ లక్ష్మీకుమారి మనవరాలు మహేష్ వాసవి దుబాయ్ కుమార్తె శ్రీ తుమేపల్లి రాగ అన్షిక 11వ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ వసంతమ్మగారి సేవాసదనము మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు ఈరోజు అన్న వితరణ చేసినారు ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రంగ మధులత పాల్గొన్నారు ఈ సందర్భంగా సేవాసదనము డైరెక్టర్ డాక్టర్ కె.షీలా రామ్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు