బీరుపూర్ మండలంలో ఉచిత పశువైద్య శిభిరం...

Published: Thursday September 23, 2021
బీరుపూర్, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండల్ కేంద్రంలోని ఉచిత పశువైద్య శిభిరాన్ని అయ్యోరి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిభిరంలో దాదాపు 1050 పశువులకు ఆవులు బర్లు మేకలు గోర్లు కోళ్ళుకు చికిత్సలను నిర్వహించారు. ఆనరోగ్య సమస్యలు ఉన్న పశువులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటిసి పాత పద్మరమేష్ వైస్ చైర్మన్ అక్కేనపెల్లి సునీల్ కుమార్ పాలకవర్గ సభ్యులు రేగొండ నారాయణ సౌల్ల నరేష్ గ్రామ సర్పంచ్ గర్షకుర్తి శిల్పరమేష్ బీర్పూర్ సింగిల్ విండో ఛైర్మన్ ముప్పల రాంచందర్ రావు కృష్ణరావు గ్రామా కార్యదర్శి సతీష్ కుమార్ వెటర్నరీ డా:జే.సునీల్ కుమార్ మరియు సిబ్బంది మార్కెట్ కమిటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.