ఏ వన్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర

Published: Wednesday September 29, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 28, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఏ వన్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ లడ్డూ వేలం పాట సోమవారం జరిగింది. వేలం పాట నిర్వహించగా 65000 రూపాయలకు పాటపాడి లడ్డును కైవసం చేసుకున్న బొద్రమోని నరేష్. అనంతరం ఫ్రెండ్స్ యూత్ తరఫున వారి కుటుంబ సభ్యులకు లడ్డును అందించి సన్మానించి శు భాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర  ఊరేగింపులో భాగంగా టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పి మహేందర్ మాట్లాడుతూ ఏ వన్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర సాయంత్రం సమయంలో అంగరంగ వైభవంగా కొనసాగిందని అన్నారు. యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణనాధుని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర లో భాగంగా  ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారుల నృత్యాలు, విన్యాసాలు, కోలాటాలతో ఆద్యంతం చూపరులను ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్ రెడ్డి, మున్సిపల్ జనరల్ సెక్రెటరీ మడుపు వేణుగోపాలరావు, శివ రాజు గౌడ్, గ్రామ పెద్దలకు మరియు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.