ఘనంగా బాపూజీ జయంతి వేడుకలు

Published: Monday October 03, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 02, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గాంధీ జయంతి సదర్భంగా  గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  మాట్లాడుతు సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని అందించిన వారు గాంధీ అని అన్నారు. అనంతరం గాంధీ పార్క్ లోని గాంధీ, నెహ్రూ లకు పూల మాలలు వేశారు. ఈ కార్యక్రమంలో పల్లె భూమేష్, ఉన్నత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area
 
 
 
 
Reply
Forward