ప్రమాదకరంగా ఉన్న గేట్ వాల్ కుండి

Published: Monday June 13, 2022

రాయికల్, జూన్ 12 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణ కేంద్రం 3వవార్డు ఎస్సీహాస్టల్ చౌరస్తాఏరియాలో మెయిన్ రోడ్డు ఆనుకొని వీధిలోకి వెళ్లే దారి మూలమలుపు పై మిషన్ భగీరథ గేటువాల్ కుండి పైకప్పు గత నాలుగు నెలల నుండి  లేదని కుండిపై కప్పులేని కారణంగా వచ్చిపోయే వాహనాలకుగానీ, ప్రజలకు కాని,ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భయపడుతున్నారు.ఈ విషయాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ కు,పురపాలక అధికారులకు, మిషన్ భగీరథ సిబ్బందికి కూడా తెలిపిన ఇప్పటివరకూ గేట్వాల్ పైకప్పు పడలేదని స్థానిక ప్రజలు వాపోయారు. గతంలో గేట్వాల్ కుండి పై కప్పు ఉండే కానిఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కుండీపైకప్పు  తీసుకువెళ్లి కుండిపై కప్పులేకుండా చేశారని, కాబట్టి ప్రమాదంజరిగే అవకాశం ఉండటంచేత, దీనిపై పురపాలక సంఘం అధికారులు స్పందించి వెంటనే గేట్వాల్ కుండి పైకప్పు వేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.