అరూర్ లో కరోనాతో వ్యక్తి మృతి

Published: Thursday May 06, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కరోనాతో బుధవారం మృతిచెందాడు. వైద్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మృతునికి సోమవారం వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ నిర్దారణ అయిందని, అతనిని హోమ్ క్వారెంటైన్ చేశారని, బుధవారం శ్వాసతో ఇబ్బందికి గురికావడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు అతనిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించే ప్రయత్నంలో మృతి చెందాడని వారు తెలిపారు.