త్వరలో ఉప్పల్ భరత్ నగర్లో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు ప్రారంభోత్సవం
Published: Tuesday November 30, 2021
మేడిపల్లి, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్ భరత్ నగర్లో త్వరలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్టు స్థానిక కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి సోమవారం భరత్ నగర్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలవాసులు స్థానికంగా రోడ్లు, డ్రైనేజీల సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. స్థానిక సమస్యలపై స్పందించిన రజితపరమేశ్వర్ రెడ్డి త్వరలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నట్టుగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ వసంత, జలమండలి మేనేజర్ సత్యనారాయణ, భుసం రఘునాథ్ రెడ్డి, వేముల నర్సింహా రెడ్డి, బింగి రవి గౌడ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, బాకారం లక్ష్మణ్, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, దేవి రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.
Share this on your social network: