త్వరలో ఉప్పల్ భరత్ నగర్లో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు ప్రారంభోత్సవం

Published: Tuesday November 30, 2021
మేడిపల్లి, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్ భరత్ నగర్లో త్వరలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్టు స్థానిక కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు  కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి సోమవారం భరత్ నగర్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలవాసులు స్థానికంగా రోడ్లు, డ్రైనేజీల సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. స్థానిక సమస్యలపై స్పందించిన  రజితపరమేశ్వర్ రెడ్డి త్వరలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నట్టుగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ వసంత, జలమండలి మేనేజర్ సత్యనారాయణ, భుసం రఘునాథ్ రెడ్డి, వేముల నర్సింహా రెడ్డి, బింగి రవి గౌడ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, బాకారం లక్ష్మణ్, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, దేవి రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.