కొండ లక్ష్మణ్ బాపూజీ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఛైర్పర్సన్

Published: Wednesday September 22, 2021
జగిత్యాల, సెప్టెంబర్ 21, (ప్రజాపాలన ప్రతినిధి) : కొండ లక్ష్మణ్ బాపూజీ వర్దంతి సందర్భంగా పట్టణంలోని అంగడి బజార్ వద్ద విగ్రహానికి మున్సిపల్ ఛైర్పర్సన్ డా.బోగ.శ్రావణి ప్రవీణ్ పూలమాల వేసి నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా  ఛైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో కృషి మరువలేనిది అన్నారు. వారి విశిష్టత గురుంచి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు బోగ.వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శి, రుద్ర శ్రీనివాస్, చేటపెళ్లి సుధాకర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వొల్లాల గంగాధర్, బోగ జిఆర్, కౌన్సిలర్లు అల్లే గంగసాగర్, గుర్రం రాము, నాయకులు అడువాల లక్ష్మణ్, శ్రీ మంజరి, ఎలిగేటి నర్సయ్య పద్మశాలి సంఘం కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.