ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి *రామోజీ ఫిలిం సిటీ లో పేదలకు ఇంటి స్థలాలు కేట

Published: Thursday November 24, 2022
సీపీయం పోరాటంతో 2007లో 600మందికి పైగా ఇంటి స్థలాలు కేటాయింపు.*

*ప్రభుత్వ అండదండలతో పేదల ఇంటిస్థలాలను ఆక్రమిస్తున్న రామోజీరావు.*

*రామోజీ పై తక్షణమే భూ ఆక్రమణ కేసు నమోదు చేయాలి.*

*రామోజీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి.*

*సీపీయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ.*

*ఛలో రామోజీ ఫిలిం సిటీ కార్యక్రమానికి వందలాది తరలివచ్చిన ప్రజలు*


భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) సిపిఎం ఆధ్వర్యంలో 2007లో రామోజీ ఫిలింసిటీలో భూపోరాటం చేసిన ఫలితంగా నాగన్ పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 189 మరియు 203లలో దాదాపు 670 మందికి పేదలకు ఇంటిస్థలం సర్టిఫికెట్లు ఇచ్చారు. కానీ నేటికి పొజిషన్ చూపించటం లేదు. అలాగే రామోజీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికితీసి పేదలకు పంపిణీ చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఛలో రామోజీ ఫిల్మ్ సిటీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా *సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ గారు* మాట్లాడుతూ... 2007లో సిపిఎం పార్టీ నాయకత్వంలో పోరాడి దాదాపు 600 మందికిపైగా ఇంటిస్థలం సాధించామని, ఈ పోరాటంలో దాదాపు పది సంవత్సరాలు కేసులు కోర్టుల చుట్టూ తిరిగామని, ఇంటి స్థలం సర్టిఫికెట్ తో పాటు ఈ భూమిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చిందని గుర్తు చేశారు, కానీ పేదలను ఈ స్థలం పైకి రానివ్వకుండా రామోజీరావు అడ్డుకుంటున్నారు, 60 గజాల చొప్పున ఇంటి స్థలం కేటాయించి హద్దులు పెట్టిన గుర్తులను కూడా చెరిపేస్తున్నారు, పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల్లోనే అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారు, సినిమా షూటింగ్లకు సెట్టింగ్లను ఏర్పాటు చేస్తూ స్థలాన్ని మొత్తం ఆక్రమిస్తున్నారు.  ఇటువంటి అక్రమాలను ప్రభుత్వం దృష్టికి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, అధికారులు రామోజీరావుకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు, ప్రజలను ఈ భూముల్లోకి రాకుండా గేట్లను ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు,  పేదల స్థలాల్లో నిర్మాణాలు చేస్తున్న రామోజీపై వెంటనే భూ ఆక్రమణ కేసు పెట్టాలి. వెంటనే పట్టాలిచ్చిన పేదలందరికీ స్థలాలు చూయించి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రామోజీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని తక్షణమే ఇళ్ళు లేని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
  ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కదిలించి ఇళ్ల స్థలాలలో ఇంటీ నిర్మాణ కార్యక్రమాన్ని మేమే దగ్గరుండి చేపడతామని హెచ్చరించారు, పేదలు ఇంటి స్థలం కోసం గుడిసెలు వేసుకుంటే వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్న ప్రభుత్వం మరి పేదల భూములను ఆక్రమించుకున్న రామోజీకి ఎందుకు అండగా నిలబడుతుందని ప్రశ్నించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి పేదలకు ఇంటి స్థలాలు చూయించి ఇల్లు నిర్మాణం చేసుకునేటట్లు చూడాలని డిమాండ్ చేశారు.

*సిపిఎం జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ * మాట్లాడుతూ... ఇది పేదలకు చెందిన భూమి ప్రభుత్వమే దగ్గరుండి పేదలకు ఇంటి స్థలాలు కోసం కేటాయించింది. ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇంటిని కూడా మంజూరు చేసింది. రామోజీరావు ప్రభుత్వంలో తమ పలుకుబడిని ఉపయోగించి పేదల భూములను ఆక్రమిస్తున్నారు ఇది సరైనది కాదు.  ఇది ముమ్మాటికీ పేదలకు దక్కాల్సిన భూమి. ప్రజలు తమ భూముల్లోకి వెళ్ళకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి గేట్లను ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇటువంటి చర్యలను మానుకోవాలని హెచ్చరించారు.  .
*ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి సామెల్, పగడాల యాదయ్య, డి.జగదీష్, మండల కార్యదర్శి సిహెచ్ జంగయ్య, మండల కార్యవర్గ సభ్యులు పి.జగన్, బుగ్గ రాములు, లింగస్వామి, మండల కమిటీ సభ్యులు ఏ.వెంకటేష్ సిహెచ్ నరసింహ, ఎం.ఆనంద్, రైతు సంఘం నాయకులు సిహెచ్.ముసలయ్య, ఎం.రామకృష్ణారెడ్డి, సీపీయం నాయకులు జి.అశోక్, నీరుడు బిక్షపతి,ఏ.నర్సింహ్మా, సీహెచ్ అయిలయ్య,పి.స్వామి, కాకి రమేష్,యాదయ్య, కే.బాల్రాజ్, దానయ్య, తదితరులు పాల్గొన్నారు.