డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి
Published: Friday June 17, 2022
కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు
మేడిపల్లి, జూన్16 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పేర్కొన్నారు.12వ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ అధికారులతో కలిసి డివిజన్లోని కామాక్షి పురం, వాసవి నగర్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ కాలనీలో నెలకొన్న పలు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి వెంకట రమణ, వాటర్ డిపార్ట్మెంట్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, ఏ ఈ జ్యోతి, మరియు డివిజన్ ప్రధాన కార్యదర్శి నారాయణ దాస్, కాలనీవాసులు తమ్మలి రవి,కల్మకల్ల లింగం, పూల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: