కంటి వెలుగు కేంద్రాలను పరిశీలించిన

Published: Friday January 20, 2023
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మధిర రూరల్ జనవరి 19 ప్రజాపాల ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి హాజరైన ప్రతిపక్ష నాయకుడు
సీఎల్పీ బట్టి విక్రమార్క పర్యటించిన
మధిర మండలం దేందుకురు, మాటూరు శిబిరాల కంటి వెలుగు కార్యక్రమానికి హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నాణ్యమైన వైద్యము కంటి అద్దాలు అందించాలని వైద్యులకు ఆదేశం
వసతుల గురించి అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా మధిర మండలం దేందుకురు, మాటూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత,మధిర శాసనసభ్యులు గౌ" శ్రీ. *భట్టి విక్రమార్క మల్లు*గురువారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు వైద్య సదుపాయాలు అందుతున్న తీరును డాక్టర్లను, రోగులను ఆయన అడిగి తెలుసుకున్నారు. సరైన మందులు,నాణ్యమైన కళ్ళ అద్దాలు అందించాలని అవసరమైన వారికి ఆపరేషన్ చేయించాలని అక్కడ ఉన్న వైద్యులను ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాల వద్ద ప్రభుత్వ ఏర్పాటు చేసిన వసతులు గురించి అక్కడి రోగులను అడిగి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కోట కృష్ణ సర్పంచ్ విజయశాంతి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ ప్రసాద్ రామారావు పలువురు నాయకులు హాస్పటల్ సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు