పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలి ** బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ *

Published: Wednesday December 28, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 27 (ప్రజాపాలన,ప్రతినిధి) : పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ డిమాండ్ చేశారు, మంగళవారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2019-20 నుండి ఇప్పటివరకు దాదాపుగా 4000 కోట్ల స్కాలర్షిప్ లు పెండింగ్ లో  ఉన్నాయని, దీంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, కూడా పెండింగ్ లో ఉన్నందున  ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, అందువల్ల విద్యార్థులు ఉన్నత చదువులకు,ఉద్యోగాల నియామకాలకు, దూరమవుతున్నారని వాపోయార. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సైదం నాగరాజు,,బిసి విద్యార్థి సంఘం జిల్లా నేత గడ్డల ప్రణయ్, బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు వైరగాడే రమేష్, నాయకులు సాగర్,తరుణ్,సాయి చరణ్, సిద్ధార్థ,సాయి తదితరులు పాల్గొన్నారు.