దుర్గామాత సన్నిధిలో అన్నదాన కార్యక్రమం

Published: Thursday October 14, 2021
కోరుట్ల, అక్టోబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణంలోనీ 22 వ వార్డ్ లోని హనుమాన్ దేవాలయంలోని దుర్గామాత సన్నిధిలో బుదవారం రోజున చండి యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం దుర్గామాత సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వార్డు కౌన్సిలర్ బిజెపి ఫ్లోర్ లీడర్ మడవెని నరేష్ పాల్గొని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో  రాంనగర్ యూత్ సభ్యులు , ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక పాల్గొన్నారు.